రామ్ గోపాల్ వర్మ శివ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో తెలుగు సినిమా మీద బాగా ప్రభావం చూపించిన సినిమాగా అర్జున్ రెడ్డిని చెప్పుకుంటారు. బాహుబలి వంటి మాగ్నం ఓపస్ ని పక్కనపెడితే, అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ తెలుగు తెరపై మనం చూస్తామని కలలో కూడా సన్నివేశాలని పెట్టి, చాలా పచ్చిగా చూపించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు.

 

ఇదే సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అక్కడా బ్లాక్ బస్టర్ సాధించింది. షాహిద్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేసింది. అయితే అలాంటి ఒరిజినల్ దర్శకుడి తర్వాతి చిత్రం ఎవరితో ఉంటుందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకసారి మహేష్ బాబుతో ఉంటుందని అన్నారు. మరో మారు బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ అన్నారు. ఆ తర్వాత ప్రభాస్ అన్నారు. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని తేలిపోయింది.

 

తాజాగా ఈ దర్శకుడి వద్దకి ఓ రీమేక్ వచ్చిందని సమాచారం. మళయాలంలో సూపర్ హిట్ అనిపించుకున్న అయ్యప్పనుం కోషియం చిత్ర రీమేక్ హక్కులని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కొనుక్కుందని అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాని తెలుగులో తెరకెక్కించే దర్శకుని కోసం వెతుకుతున్నారు. సందీప్ రెడ్డి వంగా అయితే ఈ సినిమాకి న్యాయం చెయగలడని భావిస్తున్నాడట.

 

కథలో ఉన్న ఇంటెన్సిటీని రీ క్రియేట్ చేయగల సామర్థ్యం సందీప్ కి ఉందని కబీర్ సింగ్ తో ప్రూవ్ అయింది గనక, సందీప్ కి అప్పగించాలని చూస్తున్నాడట. మరి దీనికి సందీప్ ఒప్పుకుంటాడా అన్నది సందేహంగా ఉంది. ఒరిజినల్ సినిమాతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న సందీప్రీమేక్ కి ఒప్పుకోవడం కష్టమే. చూడాలి మరేం చేస్తాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: