టాలీవుడ్లో ప్రస్తుతం పూజా హెగ్డే క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూజా హెగ్డే తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు వరుసగా అందరూ క్యూ కట్టి ఉన్నారు. ప్రస్తుతం పూజా మరో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న తో పోటీ పడి మరి ఛాన్సులు మీద ఛాన్సులు దక్కించు కుంటోంది. ఇక ప్రస్తుతం పూజా చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. మహేష్ బాబు, బన్నీ, చెర్రీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల నుంచి మొదలు పెడితే పలువురు యంగ్ హీరోల వరకు ఆమె నే తమ సినిమాలో హీరోయిన్ గా ఉండాలని పట్టుబడుతోన్న పరిస్థితి అయితే ఉందట. ఇక అఖిల్... నాగచైతన్య లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా ఆమెతోనే ఆడి పాడేందుకు ఆసక్తిగా ఉన్నారు.
వరుణ్ తేజ్ ఇప్పటికే ఓ సారి ఆమెతో నటించగా.. మరోసారి ఆమెనే హీరోయిన్ గా కావాలని పట్టుబడుతోన్న పరిస్థితి ఉందంటున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఓ యంగ్ హీరో కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సైడ్ చర్చల్లో వినిపిస్తోంది. అసలు సదరు హీరో తాజా సినిమాలో హీరోయిన్ ను సెట్ చేసేందుకు ఏకంగా ఏడాదికి పైగా పెద్ద నిరీక్షణ చేశారు. అసలు ప్లాపులు.. వరుస ప్లాపులు.. వారసత్వం కూడా కలిసి రావడం లేదు. అటు వ్యక్తిగత జీవితం కూడా అనేక వివాదాల్లో ఉంది.
ఇలాంటి టైంలో కెరీర్ పై దృష్టి పెట్టకుండా సదరు కుర్ర హీరో ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పూజా తో కూడా అతడు మిస్ బిహే వ్ చేయడంతో పూజా ఈ విషయాన్ని సదరు దర్శకుడు.. నిర్మాత దృష్టికి తీసుకు వెళ్లగా వారు సదరు యంగ్ హీరోను సైతం ఏమీ అనలేక ప్రస్తుతానికి సర్దుబాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.