ప్రపంచం అంతా కరోనా తో లాక్ డౌన్ లో డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.. మన హీరోలు మాత్రం వెడ్డింగ్ బెల్స్ మోగిస్తున్నారు. సోలో లైఫ్ ఎన్నాళ్లని ఎంజాయ్ చేస్తాం.. ఫ్యామిలీ మ్యాన్ గా బాధ్యతలు పంచుకుందాం అంటూ.. బ్యాచిలర్ బాబుల వికెట్లు ఒక్కొక్కటిగా  పడిపోతున్నాయి. హీరోలు మ్యారేజ్ ఎరేంజ్ మెంట్స్ లో బిజీగా ఉన్నారు. మా లవ్ కి ఈ లాక్ డౌన్ అడ్డు రాలేదు అనుకుంటూ ప్రేమలు, పెళ్లిళ్లతో ఎంగేజ్ అయిపోతున్నారు. లేటెస్ట్ గా  బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా మారాడు యంగ్ హీరో నిఖిల్. తను కొంతకాలంగా ప్రేమిస్తున్న డాక్టర్ పల్లవిని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు . కరోనా వచ్చినా, లాక్ డౌన్ చేసినా మా పెళ్లి మాత్రం జరిగే తీరుతుందని ఫస్టనుంచి అంటూనే ఉన్నాడు నిఖిల్.

 

నిఖిల్ తో పాటు నిశ్చితార్దం అయిపోయి పెళ్లికి రెడీ అవుతున్న మరో హీరో నితిన్. ఈ హీరో కూడా షాలిని అనే అమ్మాయిని ప్రేమించి ఫిబ్రవరి లోనే ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నాడు. నిజానికి  ఏప్రిల్ 16 న దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ కి  పెళh‌లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ తో పెళ్లి పోస్ట్ పోన్ చేసుకున్నారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ రానాకూడా రీసెంట్ గా తన లేడీ లవ్ ని  సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేశాడు. డెకార్ డిజైనర్ మిహీక బజాజ్ తో కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న రానా కూడా పెళ్లికి రెడీ అని సిగ్నల్ ఇచ్చేశాడు. తాజా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లపై చర్చించేందుకు కలుసుకున్నాయి కూడా.

 


మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా.. ఇప్పటికే 33 వచ్చేశాయి... తర్వాత చేసుకుంటానని చెబితే ఇంట్లో కొట్టేలా ఉన్నారంటూ.. మ్యాగ్జిమమ్‌ ఈ సంవత్సరం పెళ్లి చేసేసుకుంటానంటూ పెళ్లికి రెడీ అని చెప్పేశాడు సాయిధరమ్ తేజ్. మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్లికి రెడీ అంటున్నాడు. కానీ ఇప్పుడు కాదట. ఇప్పుడిప్పుడే హీరోగా లైన్లో పడుతున్న ఈ మెగా హీరో ప్రజెంట్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి నెక్ట్స్ ఇయర్ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. చూడ్డానికి ఇంకా కాలేజ్ బాయ్ లా కనిపించే .. లవర్ బాయ్ రాజ్ తరుణ్ కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నాడు. విజయవాడకు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని... ఆల్రెడీ ఇంట్లో చెప్పి.. పెద్దవాళ్లని కూడా ఒప్పించేశామని.. పెళ్లి చేసుకోవడమే లేటని అంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: