కరోనా వైరస్ ఎన్నో వ్యవస్థలను కిందది పైకి... పైది కిందకు మార్చేసింది. కరోనా దెబ్బతో ప్రపంచ ఎంతలా అతలా కుతలం అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ వైరస్ అనేది ఎంతో మంది మనుష్యలు జీవితాల తో చెలగాడం ఆడుతోంది. కరోనా దెబ్బతో ఇప్పటికే చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది ఉద్యోగాలు కూడా హుష్ కాకి అయపోయాయి. అసలు చాలా మంది ఎలా బతకాలో తెలియక ... తమ జీవితం ఎలా వెళుతుంది ? దేవుడా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పోటీ తత్వం బాగా పెరిగి పోయింది. టాలెంట్ ఉన్న వాళ్లు మాత్రమే ఫీల్డ్ లో ఉండనున్నారు. మిగిలిన వాళ్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కు కోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం తెలుగు ఎంటర్టైన్ మెంట్ రంగం మీద ఎలా పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడికక్కడ షూటింగ్లు ఆగిపోయాయి. బుల్లితె ర మీద టీవీలు అన్ని పాత సినిమాలే వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఎత్తేస్తోన్న వేళ అందరూ గతం కంటే తక్కువ రేటుకే పని చేస్తామని రెడీ అవుతున్నారట...!
ఇదే ఇప్పుడు తెలుగు బుల్లితె ర రంగంలో స్టార్ యాంకర్లుగా ఉన్న సుమ , అనసూయ మధ్య గ్యాప్ కు కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. లాక్ డౌన్ తర్వాత తాను చాలా తక్కువ రేటుకే ప్రోగ్రామ్స్ చేస్తానని అనసూయ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తోందట. ఇందులో సుమ ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఉన్నాయంటున్నారు. ఇప్పుడు వీటికి పొటీగా వెళుతోన్న అనసూయ.. వీటిని తాను తక్కువ రేటుకే చేస్తానని చెపుతుండడమే సుమ లో అసహనానికి కారణమైందంటున్నారు. పని గట్టుకుని సుమ చేసే ప్రోగ్రామ్స్ కు అనసూయ ఎందుకు పోటీగా వెళుతుందని కూడా కొందరు ఆఫ్ ద రికార్డుగా చర్చించు కుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో ? చూడాలి.