ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ అయినా ప్రభాస్ వరుస  సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్ స్టార్ గా  మారిపోయిన ప్రభాస్ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా ఇప్పటికీ హిందీలో మాత్రం భారీ వసూళ్లనే రాబట్టింది. అయితే బాహుబలి సాహో లాంటి సినిమాల తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రభాస్ కోసం స్టోరీలు సిద్ధం చేసినప్పటికీ... ప్రస్తుతం ప్రభాస్ మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ పైనే దృష్టి పెట్టారు. 

 

 ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ  సినిమా దాదాపుగా పూర్తి అయిపోయింది. ప్రస్తుతం సినిమా షూటింగులు  ఆగిపోక పోయి ఉంటే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉండేవి. అయితే రాధాకృష్ణ సినిమా తర్వాత ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. మామూలుగానే నాగ్ అశ్విన్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకుంటూ వుంటారు. దీంతో ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు నాగ్ అశ్విన్. 

 


 అయితే పాన్ ఇండియా లెవెల్ లో ఉండే ఈ సినిమాకోసం అదే రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్ తీసుకుంటే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోన్న  నేపథ్యంలో.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా ప్రభాస్ సినిమాలో  బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆలియాభట్ ను  కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ప్రభాస్ లాంటి హీరోతో సినిమా కావడం... పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆలియా భట్ ఈ సినిమాలో నటించేందుకు టక్కువ ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పూర్తవగానే ఈ  సినిమా పట్టాలెక్కి అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: