మెగా హీరోల సినిమాలు వస్తున్నాయి అనగానే మన తెలుగులో ప్రేక్షకులకు ఒకరకంగా పండగ వాతావరణం ఉంటుంది. వాళ్ళ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చిరంజీవి నుంచి మొన్నీ మధ్య వచ్చిన వైష్ణవ తేజ్ వరకు కూడా మంచి క్రేజ్ అనేది ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి తన హీరోలకు చాలా సూచనలు ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న నేపధ్యంలో ఆయన నుంచి వారికి పలు సలహాలు కీలకంగా వస్తున్నాయి అని అంటున్నారు. చిరంజీవి నిర్మాతల కష్టాలు తెలిసిన మనిషి. 

 

అందుకే ఇప్పుడు సినిమాల పారితోషికం విషయంలో ఎక్కడ కూడా హీరోలు నిర్మాతలను ఇబ్బంది పెట్టవద్దు అని ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. అదే విధంగా ఓటీటీ ఫ్లాట్ ఫాం లో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ఎవరు చెప్పినా సరే ఓకే చెప్పాలని ఇప్పుడు నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు సహకరించాలని ఆయన సూచించారు. ఇక రాబోయే రెండు మూడేళ్ళకు సరిపడా కథలను విని సిద్దంగా ఉంచుకోవాలి అని కూడా ఆయన సూచించారు అని అంటున్నారు. కథలను ఇప్పుడే వింటే వరుసగా సినిమాలు చేయవచ్చు అని సూచనలు చేసారట. 

 

రామ్ చరణ్ కి సంబంధించిన ఒక కథను చిరంజీవి ఇప్పటికే విని ఓకే చేసారు అని అంటున్నారు. అలాగే వరుణ్ తేజ్ కి బన్నీ కి కూడా ఆయన సలహాలు ఇచ్చారని భవిష్యత్తు లో సినిమా ఇబ్బంది పడుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే సిద్దంగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అని ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. ప్రధానంగా  నిర్మాతలను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టవద్దు అని చిరంజీవి వారికి స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: