మన తెలుగు హీరోలు ఇప్పుడు బాలీవుడ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెల్సిందే. అక్కడి సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఇక్కడికి తీసుకు రావాలి అని అనేక విధాలుగా ప్రయత్నాలు చేసారు గాని పెద్దగా అది సాధ్యం కాలేదు అనే చెప్పవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు అనుకున్నది సాధించడానికి మంచి వసూళ్లను సాధించడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మన టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రభాస్ బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టారు. 

 

ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ లో బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు కూడా పరుశురాం సినిమా తో బాలీవుడ్ లో బిజీ అవ్వాలని కూడా చూస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు అనే వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాను తీసుకొచ్చి ఆ తర్వాత ఆయన బాలీవుడ్ దర్శకుడి తో సినిమాను చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ బన్సాలి మూవీ దాదాపుగా ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తో ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. 

 

సినిమా హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ ఇక ఆలోచన చెయ్యాల్సిన అవసరం లేదని చాలా మంది అంటున్నారు. మరి ఆ సినిమా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజయం సాధిస్తుంది అనేది ఎదురు చూడాలి. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ అక్కడ బిజీ కావడం ఖాయమనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన వారిలో.

మరింత సమాచారం తెలుసుకోండి: