ప్రభాస్ కు మ్యూజిక్ డైరెక్టర్ గండం ఉంది. సాహో సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ముందు ఒకర్ని సెలక్ట్ చేస్తారు. చివరికొచ్చేసరికి మరొకరు ఉంటారు. సాహోకే కాదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. 

 

జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రభాస్ సినిమా మొదలై రెండేళ్లు కావొస్తోంది. సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేదిని ఎనౌన్స్ చేశారు. తీరా చూస్తే.. ఇప్పుడీ ప్లేస్ ఖాళీ. తెలుగులో వి సినిమా ఒక్కటే చేస్తున్నానని అమిత్ త్రివేది పేర్కొనడంతో.. జాన్ మ్యూజిక్ డైరెక్టర్ కత మళ్లీ మొదటికొచ్చింది. 

 

సాహో సినిమాకు శంకర్ ఎసాన్ లాయ్ ను తీసుకుంటే.. దర్శకుడితో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ తో తప్పుకున్నారు. అప్పటికే ఆయన కంపోజ్ చేసిన బేబి వోంట్ యు వాడుకొని.. మిగతా మూడు పాటలను ముగ్గురు సంగీత దర్శకులతో కంపోజ్ చేయించారు. ఇలా నాలుగు పాటలకు నలుగురు పనిచేస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను జిబ్రాన్ ఇచ్చాడు. 

 

జాన్ విషయంలోనూ సాహో కథ రిపీట్ అవుతోంది. సినిమా హిందీ రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ కొనుక్కోవడంతో.. మ్యూజిక్ డైరెక్టర్స్ ను కూడా కంపెనీ రికమెంట్ చేస్తారట. ఈ లెక్కన సాహో మాదిరి జాన్ లో కూడా ఒక్కో పాటను ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తాడన్న మాట. రీ రికార్డింగ్ మాత్రం తెలుగు, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిస్తుంది. మొత్తానికి ప్రభాస్ కు మ్యూజిక్ డైరెక్టర్ గండం పొంచి ఉందనిపిస్తుంది. సాహో మూవీ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ ను ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాకు కూడా సంగీత దర్శకుడు మారిపోయాడని సమాచారం.  




మరింత సమాచారం తెలుసుకోండి: