సోషల్ మీడియాలో అయినా ఎక్కడ అయినా సరే మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసనా కొణిదెల‌ చాలా హుందా గా ఉంటారు. తనకు ఎంత పేరు ఉన్నా సరే ఆమె ఏ రోజు కూడా  తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నాలను ఆమె చేస్తూ ఉంటారు. తన భర్త రామ్ చరణ్ కి ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా ఆయన గురించి ప్రస్తావించే ప్రయత్నం దాదాపుగా చేయరు అనే విషయం చాలా సందర్భాల్లో జనాలకు అర్ధమైంది. కొన్ని విష‌యాల్లో ఉపాస‌నా గ‌ట్స్ ను అంద‌రూ మెచ్చుకుంటారు. గ‌తంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ముంబైలో జ‌రిగిన ఓ స‌మావేశానికి సౌత్ నుంచి ఏ సినిమా స్టార్ ను ఆహ్వానించ లేద‌న్న దానిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

 

దీనిపై అప్ప‌ట్లో ఆమె మోదీ గారు మీకు సౌత్ సినిమా స్టార్స్ క‌న‌ప‌డ‌లేదా ? అని నేరుగా సోష‌ల్ మీడియాలో సంధించిన ప్ర‌శ్న పెద్ద హైలెట్ అయ్యింది. ఇలా ఏ విష‌యంలో అయినా ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తుంటుంది. ఇప్పుడు ఆమె ఏది చేసినా సరే కొత్తగానే ఉంటుంది. తాజాగా ఆమె కొన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. పాత కండోమ్స్ తో తయారు చేసిన దుస్తులను వేసుకున్నారు ఇండియన్ టాయిలెట్ ని ప్రమోట్ చేశారు అదే విధంగా ఇప్పుడు ఆర్గానిక్ మీద ఆమె దృష్టి పెట్టారు. తాజాగా తన వ్యవసాయ క్షేత్రంలో ఆమె కొన్ని ఫోటోలను దిగారు. 

 

ఇప్పుడు ఆమెను కేంద్రం ఒక చిన్న పదవిలో నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి దక్షిణ భారత దేశంలో ప్రమోషన్ బాధ్యతలను ఆమెకు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.  దీనికి ఒక కమిటీ ని కూడా నియమించే ఆలోచనలో ఎప్పటి నుంచో కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆమెకు ఆ బాధ్యతలను ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: