మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సంవత్సరం ప్రారంభం లోనే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. త్రివిక్రమ్ తర్వాత సినిమాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే అఫీషియ గా ప్రకటించారు. అందుకు కన్‌ఫర్మేషన్ గా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ’ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ చేశారు. ఈ టైటిల్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. దాంతో మళ్ళీ త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్నారని తెలుస్తుంది. అందుకు స్క్రిప్ట్ కూడా సిద్దం చేస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ సినిమా బాలీవుడ్ మూవీకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. కేవలం నెల రోజుల వర్క్ మాత్రమే మిగిలిఉంది. జూన్ నుండి గనక షూటింగ్స్ మొదలైతే జూలై వరకు ఈ సినిమా కంప్లీటవుంది. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పరిస్థితులను బట్టి సెప్టెంబర్ లేదా నవంబర్ లో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత వెంటనే క్రిష్ సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళనున్నారు. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. తర్వాత గబ్బర్ సింగ్ లాంటి సంచలనం సృష్ఠించిన హరీష్ శంకర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయి. అలాగే త్రివిక్రం తోను సమాంతరంగా సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. ఇప్పటికే త్రివిక్రం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో జల్సా..అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: