కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన క్రేజీ మూవీ కెజిఎఫ్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా రికార్డ్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వల్ సెట్స్ మీద ఉంది. కెజిఎఫ్ 2 మరింత క్రేజీగా మారింది. సీక్వల్ లో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలిసి సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. 


ప్రశాంత్ నీల్ కూడా ఆ అంచనాలకు తగినట్టే కథ కథనాలు రాసుకున్నాడట. కెజిఎఫ్ 2 సినిమా తెలుగు వర్షన్ ను భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా బిజినెస్ కూడా ఇక్కడ బాగా చేస్తుంది. ఐతే కెజిఎఫ్ సినిమా రిలీజ్ చేసి సాయి కొర్రపాటి చాప్టర్ 2ని రిలీజ్ చేయాలని అనుకోగా కన్నడ మేకర్స్ ఈ సీక్వల్ కు ఎక్కువ కోట్ చేస్తున్నారట. కేవలం తెలుగులోనే ఈ సినిమాను 20 కోట్లకు అమ్మాలని ఫిక్స్ అయ్యారట అందుకే సాయి కొర్రపాటి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. 


సాయి కొర్రపాటి వెనక్కి తగ్గడంతో దిల్ రాజు సీన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. కన్నడ నిర్మాతలు కూడా దిల్ రాజు అయితే సినిమాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. మొత్తానికి మొదటి పార్టీ కొన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి షాక్ ఇస్తూ ఈ సీక్వల్ ను వేరే నిర్మాతకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఎవరు ఎక్కువ ఇస్తే వారికి సినిమా హక్కులు ఇవ్వడం మంచిదే కానీ మొదటి పార్టీ ను ఎంకరేజ్ చేసిన సాయి కొర్రపాటి ఛాన్స్ ఇస్తే బాగుండేదని అంటున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: