వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. జూలై 18 వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్లోనే అత్యధిక రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండ తో ‘ఫైటర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలావుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ అదిరిపోయే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. 

 

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు స్క్రిప్ట్ ఆల్రెడీ సిద్ధం చేసినట్లు త్వరలోనే ఆయనకు వినిపించబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరే బాప్’ అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరిని డైరెక్ట్ చేయలేదు. యధావిధిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈసారి సల్మాన్ ఖాన్ నీ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్లు వార్తలు రావటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

 

గతంలో సల్మాన్ ఖాన్ వరుస ప్లాపులు తనని వెంటాడుతున్న సమయంలో తెలుగులో మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’ సినిమా హిందీలో ‘వాంటెడ్’ గా రీమేక్ చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఏకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సినిమా అనే సరికి ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వైరల్ గా మారినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: