ముందుగా హీరోయిన్ గా సినిమా పరిశ్రమకు రంగప్రవేశం చేసి, ఆపై కొన్నేళ్ల హీరోయిన్ గా కొనసాగిన అనంతరం తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని కుటుంబ జీవితంతో జీవనం కొనసాగించేవారు కొందరైతే, మరికొందరు మాత్రం వివాహం అనంతరం మధ్యలో అమ్మ, అక్క, వంటి పెద్ద పాత్రలు చేయడానికి కూడా ఇష్టపడుతూ మళ్ళి సినిమాల్లోకి వస్తున్న వారు అక్కడక్కడా ఉన్నారు. అయితే వీరందరికీ కొంత భిన్నంగా ముందుగా నీతోడుకావాలి సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ ఛార్మి కౌర్, ఆ తరువాత మెల్లగా తన ఆకట్టుకునే అందం అభినయంతో హీరోయిన్ గా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. 
 
 
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్న ఛార్మికి తెలుగులో కూడా ఎంతో మంచి పేరుతో పాటు ఎందరో అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఇటీవల కొన్నేళ్ల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతి లక్ష్మి సినిమాలో ప్రధాన పాత్రలో నటిచడంతో పాటు ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన ఛార్మి, అనూహ్యంగా ఆ సినిమా తరువాత వెండితెరపై పూర్తిగా కనుమరుగయ్యారు. ఇక అక్కడి నుండి పూరి జగన్నాథ్ తీస్తున్న ప్రతి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్న ఛార్మి, తనకు హీరోయిన్ గా కంటే నిర్మాతగానే ప్రశాంతంగా ఉందని, నిర్మాతగా ఉంటె పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం లేదని, అదే హీరోయిన్ గా ఉన్న సమయంలో మాత్రం తనకు ఎంతో టెన్షన్, విపరీతమైన ఆలోచనలు ఉండేవని చెప్పడం జరిగింది. 
 
 
కావున ఇకపై తాను పూర్తిగా నిర్మాతగానే వ్యవహరిస్తానని ఆమె అన్నారు. ఇక ఎప్పటికప్పుడు తన సినిమాల, వ్యక్తి విషయాలను గురించి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకునే అలవాటున్న ఛార్మి, మధ్యలో తన పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోటోలను చూసిన కొందరు అభిమానులు, మీరు మళ్ళి మీరు సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటూ కోరుతూ ఉండడం జరుగుతోంది. ఇటీవల ఛార్మి తన బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోలని చూసిన ఆమె ఫ్యాన్స్, కన్నెవయసు సినిమాలోని ఏ దివిలో విరిసిన పారిజాతమో..... ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో.....అంటూ ఆమె అందంపై సరదాగా పొగడ్తలు కురిపిస్తూ, మీరు మళ్ళి హీరోయిన్ గా రావాల్సిందే అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కోరుతున్నారు. మరి అభిమానుల కోరికను ఛార్మి ఎంతవరకు మన్నించి సినిమాల్లోకి వస్తారో ఏమో చూడాలి మరి.....!!
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: