టాలీవుడ్ లో క్లాసిక్ అండ్ రొమాంటిక్ మూవీస్ చేస్తూ సెన్సిబుల్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం నాగ చైతన్య - సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శ్రీ సునీల్ నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్దం కాబోతుంది. ఈ సినిమాని ముందుగా సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని భావించగా కరోనా వచ్చి వాయిదా వేసింది. అయితే ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా కూడా ప్రొడ్యూసర్ సునీల్ నారాయణదాస్ నారంగ్ గారితోనే చేస్తున్నట్టు సమాచారం. ఓ పెద్ద హీరో ఈ సినిమాలో నటిస్తున్నారని, స్టోరీ డిస్కషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయని, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే శేఖర్ కమ్ముల పనితీరు మరియు లవ్ స్టోరీ సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టే శేఖర్ కమ్ములతో తమ నెక్స్ట్ ప్రాజెక్ట్కు కూడా ప్రొడ్యూసర్ సునీల్ నారాయణదాస్ నారంగ్ సైన్ చేసేసుకున్నారు. అయితే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ మీద నిర్మించనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన తదుపరి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
కాగా సున్నితమైన ప్రేమకథలని ఎంతో అందంగా తెరకెక్కించడంలో దిట్ట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన గత చిత్రాలు 'ఆనంద్' 'హ్యాపీడేస్' 'గోదావరి' 'ఫిదా' లాంటి సినిమాలు గమనిస్తే ఎక్కడ చూసినా మనకు ప్రేమే కనిపిస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాలలో అనుబంధాలు పెనవేసుకునేలా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఇక 'లవ్ స్టోరీ' సినిమాతో మరోసారి నాగ చైతన్య - సాయి పల్లవి జంటతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే 'లవ్ స్టోరీ' చిత్రానికి సంబంధించి టీజర్.. సాంగ్ లిరికల్ వీడియోలు విడుదల కాగా అవి విశేష ఆదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన సాయి పల్లవి పోస్టర్ కూడా అందర్నీ కట్టిపడేస్తోంది. 'ఫిదా' సినిమాలో తన నటనతో కుర్రకారుని ఫిదా చేసిన ఈ మళయాళీ ముద్దుగుమ్మ మరోసారి తన మ్యాజిక్ చూపించేలా ఉంది. కాగా చైతూతో కలిసి ఆమె నటించడం ఇదే ఫస్ట్ టైం.. అందుకే వీరి జోడీపై అంచనాలు పెరిగాయి.