పెళ్లి, పిల్లలు అంటూ ఫ్యామిలీకి టైమ్ స్పెండ్ చేసి ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీదకు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీనియర్ హీరోయిన్లు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగి చాలా కాలం గ్యాప్ తర్వాత పిల్లాపాపలను ఓ లైన్లో పెట్టి .. ఇప్పుడు మళ్లీ తీరిగ్గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఒకప్పటి సీనియర్ హీరోయిన్లు.. వాళ్లలో ఇప్పుడు హాట్ టాపిక్ భాగ్యశ్రీ.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మెమరబుల్ మూవీస్ చేసిన భాగ్యశ్రీ.. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. ప్రబాస్, రాధాక్రుష్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జాన్ సినిమాలో మెయిన్ లీడ్ ప్లే చేస్తోంది భాగ్యశ్రీ. ఇప్పటికీ స్లిమ్ గా అంతే బ్యూటిఫుల్ గా ఉన్న భాగ్యశ్రీ తెలుగు తెరకు మరోసారి తళుక్కుమంటోంది.
ప్రభాస్ సినిమాతో భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇస్తుంటే.. చిరంజీవి సినిమాతో జెనీలియా కమ్ బ్యాక్ అవుతోంది. మెగాస్టార్ సుజిత్ డైరెక్షన్లో చెయ్యబోతున్న లూసిఫర్ రీమేక్ కోసం జెనీలియా మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన జెన్నీ.. రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ల చేసుకుని పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తోంది.
ఈ ఇద్దరితో పాటు.. డ్యాన్సింగ్ సెన్సేషన్ సిమ్రన్ కూడా .. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మద్యనే రజనీకాంత్ పేట సినిమాలో కామియో రోల్ చేసి సర్ ప్రైజ్ చేసిన సిమ్రన్.. రాజ్ తరుణ్ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. సిమ్రన్ తెలుగులోనే కాదు సౌత్ లో..అందరి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మరి సెకండ్ ఇన్సింగ్స్ లో ఇంకెలాంటి హడావిడి చేస్తారో చూడాలి.