సెన్సిబుల్ కథల్ని చాలా హృద్యంగా తెరకెక్కించే దర్శకులలో శేఖర్ కమ్ముల ప్రథముడు. ఆయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ సున్నితమైన కథలే. వ్యక్తిగా శేఖర్ కమ్ముల కూడా సున్నిత మనస్కుడే. అందుకే ఆయన చిత్రాలన్నీ సున్నితంగానే ఉంటాయి. ఆనంద్ నుండి మొదలుకుని మొన్నటి ఫిదా వరకూ సున్నితత్వం ఆయన సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది.

 

 

ఆయన చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా అందంగా ఉంటాయి. సినిమా కథలో హీరో ఉన్నా, కథంతా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది. అందుకే శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోల కంటే హీరోయిన్లకే ఎక్కువ పేరొస్తుంది. ప్రస్తుతం అదొక కంప్లైంట్ గా కూడా మారింది. హీరోయిన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని కొందరు విమర్శలు కూడా చేశారు. మరి మిగతా సినిమాలల్లో హీరోలకే ప్రాధాన్యం ఇస్తున్న వారిని అనరెందుకో..!

 

 

అదలా ఉంచితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ అనే చిత్రం చేస్తున్నాడు. నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగ నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగ పూర్తి కావొచ్చింది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ పాటికే సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు.

 

లవ్ స్టోరీ ఇంకా రిలీజ్ కాకముందే శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రానికి నిర్మాత దొరికేసాడు. లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్న సునీల్ నారాయణదాస్ నారంగ్, శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడట. లవ్ స్టోరీ మీద ఉన్న నమ్మకంతో నారయణ్ దాస్ నారంగ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఒక సినిమాకి రెండేళ్ళకి పైగా టైమ్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు తీసుకువస్తాడో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: