మొదటి సినిమా సూపర్ హిట్ అయితే నిర్మాతలంతా ఆ దర్శకుని కోసం క్యూ కడుతుంటారు. రెండవ సినిమా తమ బ్యానర్ లోనే చేయాలని పట్టుబడుతుంటారు. హీరోలు సైతం ఆ దర్శకుడితో సినిమా చేయడానికి ముందుకు వస్తుంటారు. కానీ అజయ్ భూపతి పరిస్థితే వేరు. ఆయన తన మొదటి సినిమా ఎంత కష్టపడ్డాడో తెలియదు గానీ రెండవ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.

 

అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన ఆర్ ఎక్స్ ౧౦౦ చిత్రం బ్లాక్ బస్టర్ అయినా కూడా రెండవ సినిమాకి హీరో దొరక్క విసుగు చెందుతున్నాడు. మహా సముద్రం అనే స్క్రిప్టు పట్టుకుని అతని తిరగని చోటు లేదు. కలవని హీరో లేడు. అందరూ స్క్రిప్టు ఓకే చేశారు కానీ ఎవ్వరూ టైమ్ ఇవ్వలేకపోయారు. చివరాఖరికి శర్వానంద్ వద్దకి వచ్చిన మహాసముద్రం అక్కడే ఆగిపోయింది.

 

శర్వానంద్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే హీరో ఒప్పుకున్నా ఈ దర్శకుడి కష్టాలింకా తీరలేదు. ఈ సినిమాలో హీరోతో పాటు మరో స్పెషల్ రోల్ ఉందట. ఆ పాత్రకి హీరో అంతటి ఇంపార్టెన్స్ ఉందని సమాచారం. ఆ పాత్రని చేయడానికి ముందుగా సిద్ధార్థ్ అయితే బాగుంటుందని అనుకున్నారు. బొమ్మరిల్లు ద్వారా తెలుగులో ఫేమస్ అయిన సిద్ధార్థ్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది.

 

దాంతో సిద్ధార్థ్ ని ఆ రోల్ ఫిక్స్ చేయాలని భావించాడు. కథ కూడా వినిపించాడట. సిద్ధార్థ్ కి కథ కూడా నచ్చిందని సమాచారం. అయితే ఏమైందో ఏమో కానీ సడెన్ గా సిద్ధార్థ్ అజయ్ కి స్పందించడం లేదట. ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వట్లేదట. దాంతో అజయ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదట. ఈ మేరకు సిద్ధార్థ్ మహాసముద్రం నుండి తప్పుకున్నట్లే అని అనుకుంటున్నారు. మరి ఆ స్థానంలో అజయ్ కి ఏ హీరో దొరుకుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: