పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నితిన్, షకలక శంకర్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి సెలబ్రెటీలు దేవుడిగా పూజిస్తారు. సామాన్య ప్రజలే కాదు ఎంత మంది సెలబ్రెటీలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ పాటలను అరే మేకప్ చేయడం మొదటి పాటలు డాన్స్ వేయడం అతడు మేనరిజాన్ని పాటించడం లాంటివి చేస్తుంటారు సెలబ్రిటీలు. ఒకవేళ పవన్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అదృష్టవశాత్తు సుడిగాలి సుధీర్ తన ఫేవరేట్ హీరో అయిన పవన్ కళ్యాణ్ తో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ బిహేవియర్ దగ్గర్నుంచి చూసిన సుడిగాలి సుధీర్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించిన అందరి అభిమానాలను ఫిదా చేస్తున్నాడు. 


సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో చాలామంది కమెడియన్లు నటించారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఆ హాస్యనటులకు పవన్ కళ్యాణ్ కు మధ్య స్నేహం ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన షాట్ అయిపోయిన తర్వాత ఇతర హీరోల్లాగా క్యారవాన్ లోకి వెళ్లి కూర్చోకుండా సామాన్యుడు వలే బయటే ఉంటూ అందరితో ముచ్చటిస్తూ ఉంటారంట, అలాగే చుట్టూ ఏం జరుగుతుందనేది చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉంటారట. ఈ విషయాన్ని సుడిగాలి సుధీర్ వెల్లడించాడు. 


ఒకవేళ తనకు నిద్ర వస్తే తన మెడలో ఎర్ర కండువా వేసుకుని ఎక్కడపడితే అక్కడ సామాన్యుడు లాగా నేల మీద పడుకొంటారు అని చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు. చాలా పెద్ద సెలబ్రెటీలు అలా సాదాసీదాగా ఉండటం తాను ఎప్పుడూ చూడలేదని సుడిగాలి సుధీర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ నుండి సింప్లిసిటీ ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. పవన్ తో తాను గడిపిన సమయం ఒక మధురమైన అనుభూతిని కలిగించిందని... అది తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు సుధీర్.

మరింత సమాచారం తెలుసుకోండి: