ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన న్యూస్ లు ఇట్టే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సినీ నటి విమాన ప్రమాదంలో మరణించిందని వార్తలు పాక్ లో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన ‘పీకే-8303’ విమానం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకి లాహోర్ నుండి బయలుదేరగా, 2:45 గంటలకు కరాచీ ఎయిర్పోర్ట్లో దిగాల్సి ఉంది. కాని అందులో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. క్రాష్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ సీసీటీవీ ఫూటేజ్ రిలీజైంది. బిల్డింగ్లపై విమానం కూలుతున్నట్లు ఆ వీడియోలో ఉన్నది.
ల్యాండింగ్ సమయంలో విమానం నేరుగా ఇండ్లపై కూలినట్ల ఆ వీడియోలో కనిపిస్తోంది.విమానంలో 91 మంది ప్యాసింజెర్లు, 8 మంది సిబ్బంది ఉండగా, దాంట్లో 19 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. రన్వేకు కొన్ని వంద మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఈ విమాన ప్రమాదంలో అయేజా ఖాన్ ఆమె భర్త డానిష్ మరణించారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.
ఈ వార్తలని ఖండిస్తూ అయేజా తన సోషల్ మీడియాలో పేజ్లో పోస్ట్ పెట్టారు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం వల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బతినడమే కాదు.. అభిమానులు కన్నీరు పెట్టుకుంటారని వాపోయింది. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోకుండా దయ చేసి పుకార్లు పుట్టించకండి. ఇలాంటి విషయాలలో కాస్త తెలివిగా వ్యవహరించండి. తప్పుడు వార్తలని రాసేవారిని తప్పక శిక్షిస్తాడు అని కామెంట్ పెట్టింది. మరోవైపు విమానంలో ప్రయాణించిన వారందరూ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఏడాది ఇదో పెద్ద విమాన ప్రమాదం అని అక్కడి వారు అంటున్నారు.