ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ కు తమ సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మిస్సయిన సంఘటనలు ఉంటాయి. ఇలా చేతి వరకు వచ్చిన సినిమాలు మిస్ అవడంతో.. వాటిని తలుచుకుని బాధ పడని హీరోయిన్ చాలా మందే అనే చెప్పాలి. ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినీ కెరియర్ లో కూడా అలాంటి సినిమాలు రెండు ఉన్నాయి. వాటిని తలుచుకొని ఈ బ్యూటీ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. అందులో మొదటిది  " మిస్టర్ ఫర్ఫెక్ట్ " సినిమా. 


ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో మొదట్లో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆమెతో నాలుగు రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ రకుల్ ప్రీత్ సింగ్ ని తప్పించి ఆ స్థానంలో ప్రముఖ హీరోయిన్ కాజల్ ను తీసుకోవడం జరిగింది. ఇంక రకుల్ ఈ విషయంపై అప్పుడు ఆ సినిమా నుంచి నన్ను ఎందుకు తప్పించారు నాకు ఇప్పటికీ అర్థం అవ్వటం లేదు అని తెలియజేస్తుంది ఈ బ్యూటీ. 


ఇక మరో సినిమా విషయానికి వస్తే... నాగచైతన్య హీరోగా నటించిన ఆటోనగర్ సూర్య. వాస్తవానికి ఈ సినిమాలో ముందుగా సమంతను హీరోయిన్ గా అనుకోవడం జరిగింది.. కానీ సమన్తా కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అనుకున్నారు. అన్ని ఓకే అనుకున్న తర్వాత సరిగ్గా షూటింగ్ మొదలయ్యే సమయానికి సమంత మళ్లీ కాల్ షీట్ ఎక్స్ చేంజ్ చేయడం జరిగింది. ఆ సినిమా నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ని తప్పించారు. ఇలా తన సినీ కెరీర్ లో తాను మిస్సయిన సినిమాల గురించి తెలియజేసింది రకుల్ ప్రీత్ సింగ్. అంతేకాకుండా అ ఆ సమయంలో తాను సినీ కెరియర్ గురించి పెద్దగా ఆలోచించలేదు అని నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను అని రకుల్ తెలియజేసింది. కానీ ఆ రెండు సినిమాల అనుభవాలు మాత్రం నాకు బాగా పనికి వచ్చాయి అని రకుల్ తెలియజేయడం జరిగింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: