ఎటువంటి అంచనాలు లేకుండా ఒక్క మెగాస్టార్ మేనల్లుడు అనే అర్హత తో టాలీవుడ్ లో కి అడుగు పెట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ...ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ సినిమా పిల్ల నువ్వులేని జీవితం అనే సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పటివరకు అయన చేసిన ప్రతి సినిమా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తనకంటూ ప్రత్యేక స్టైల్ ని సాయి ధరమ్ తేజ్ క్రియేట్ చేసుకున్నారు. సుబ్రహ్మణ్యం ఫర్  సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్ వంటి సినిమాలు మంచి సక్సెస్ ని తెచ్చిపెట్టాయి.

IHG

ఆ తరువాత వచ్చిన నక్షత్రం, జవాన్, ఇంటలిజెంట్ , తేజ్ ఐ  లవ్ యు.. వంటి సినిమాలు మెగాభిమానులను నిరుత్సహ పరచాయి. ఆ తరువాత వచ్చిన చిత్రలహరి సినిమా కలెక్షన్స్ పంట పండించింది. చిత్రలహరి విజయంతో సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే అనే ప్రయోగాత్మక చిత్రాన్ని చేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరియర్లో ఓ మైలురాయి గా మిగిలిపోయింది. కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర విజయంతో సాయి ధరమ్ ప్రస్తుతం ...సోలో బ్రతుకే సో బెటర్ ..అనే సినిమాను చేస్తున్నాడు ...ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో షూటింగ్ ఆగిపోవడంతో ...లాక్ డౌన్ అనంతరం ఈ సినిమాని షూరూ చేయడానికి చిత్ర నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

IHG

సాయి ధరమ్ తేజ్ కి హీరోయిన్ సమంతపై క్రష్ ఉందని సైమా అవార్డుల వేడుకలో చెప్పాడు. ఈ మెగా హీరో సైమా అవార్డుల ఫంక్షన్లో యాంకర్ శ్యామల అడిగిన ప్రశ్నకు సమాధానం వెతుక్కోకుండా టక్కున చెప్పేశాడు.  అదేంటంటే ..మీరు ఏ హీరోయిన్ పై క్రష్ ఉంది అని అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ ..సమంత పై క్రష్ ఉందని చెప్పాడట..ఆ విషయాన్నీ విన్న యాంకర్ శ్యామల షాక్ తిందట...అయితే ఆ అవార్డుల వేడుకలో పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాకు బెస్ట్ డెబ్యూ హీరో అవార్డుని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: