చిన్న చిన్న హీరోలు ఇప్పుడు తమ భవిష్యత్తు విషయంలో ఆందోళనగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. వాళ్ళతో ఇప్పుడు సినిమాలు ఎవరు చేస్తారు అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. లాక్ డౌన్ లో స్టార్ హీరోలతో పెద్ద సినిమాలను తక్కువ బడ్జెట్ లో చెయ్యాలని ఇమేజ్ లేని హీరోలను పక్కన పెట్టాలి అని భావిస్తున్నారని అని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒక టాక్ టాలీవుడ్ లో వినపడుతుంది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో పెద్ద పెద్ద నిర్మాత‌లు సైతం త‌క్కువ బ‌డ్జెట్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంటే.. మ‌రో వైపు పెద్ద పెద్ద హీరోలే రెమ్యున‌రేష‌న్లు త‌గ్గించుకునేందుకు రెడీ అవుతుండ‌డంతో చిన్న హీరోల‌తో ఎవ‌రు సినిమాలు చేస్తారా ? అన్న సందేహాలు స‌హ‌జంగానే ఉన్నాయి.

 

సినిమాలు లేని చిన్న హీరోలను, గతంలో రెగ్యులర్ గా సినిమాలు చేసే వారిని తమ సినిమాల్లో తీసుకోవాలని ఇప్పుడు స్టార్ హీరోలు భావిస్తున్నారు. రామ్ చరణ్ శర్వానంద కి అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా రామ్ కి తన సినిమాలో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాలో రామ్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు చిరంజీవి కూడా అదే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

 

సినిమాలు లేని ఒక ఇద్దరు హీరోలతో చిరంజీవి ఇప్పటికే మాట్లాడినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళను తన సినిమాలోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇక మహేష్ బాబు కూడా ఒక యువ హీరోని తన సినిమాలో తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అతను దాదాపుగా నిఖిల్ అని అంటున్నారు. ఇప్పుడు వారిని ఆదుకునే ఆలోచనలో స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారని సమాచారం. ఏదేమైనా క‌రోనా టాలీవుడ్ లో చాలా మంది ఆశ‌ల‌ను.. క‌ల‌ల‌ను పూర్తిగా రివ‌ర్స్ చేసేసింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: