మాస్ మహారాజ్ రవితేజ, రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో రెండో సారి నటించడం ఫిక్స్ అయ్యింది. ఇటీవలే ఈసినిమా ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అయితే లాక్ డౌన్ వల్ల మే లో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది ఇంతలో గత  కొన్ని రోజుల నుండి ఈసినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది అయితే ఈ వార్తల పై ఈచిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ స్పందించాడు.
 
సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ను నమ్మొద్దు మాబ్యానర్ లో రవితేజ తో రమేష్ వర్మ సినిమా చేయనున్నాడని ఆయన తెలిపారు అలాగే ఈసినిమాను భారీ బడ్జెట్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తామని త్వరలోనే సినిమా కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కోనేరు సత్యనారాయణ వెల్లడించాడు. ఇక రమేష్ వర్మ తో ఇంతకుముందు రవితేజ వీర చేయగా ఆ సినిమా పరాజయం చెందింది. 
 
ప్రస్తుతం రవితేజ ,గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ లో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రవితేజ తనకు బాగా కలిసొచ్చిన పోలీస్ పాత్రలో అతనికి జోడిగా శృతిహాసన్  నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయకురాలి పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తుండగా  ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు లో విడుదలకానుంది.  ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలను చవిచూస్తున్న రవితేజ,ఈ క్రాక్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా సినిమా పై అంచనాలను పెంచింది. ఈ సినిమాలే కాకుండా రవితేజ, వక్కంతం వంశీ , త్రినాధరావు నక్కిన తో కూడా సినిమాలు చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమాలు లాంచ్ కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: