సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలని ఒప్పుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే తర్వాతి చిత్రం గురించి ఆలోచిస్తున్నాడు. ఆచార్య షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సందేశంతో కూడిన సినిమాలని డెలివర్ చేసే కొరటాల శివ చిరంజీవిని ఎలా చూపిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 


సినిమా అనంతరం చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నాడనేది సస్పెన్స్ గా మారింది. మళయల చిత్రమైన లూసిఫర్ రీమేక్ హక్కులకి కొనుక్కున్న చిరంజీవి, దాన్ని తెలుగు ప్రేక్షకులకి తగినట్టుగా తీర్చిదిద్దడానికి సాహో దర్శకుడు సుజిత్ కి అప్పగించాడు. సాహో సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, అతని స్టైలిష్ మేకింగ్ నచ్చిన చిరంజీవి ఈ బాధ్యతని సుజిత్ కి అప్పగించాడు. 

 

ప్రస్తుతం సుజిత్ లూసిఫర్ తెలుగు స్క్రిప్టు మీద వర్క్ చేస్తున్నాడు. ఒరిజినల్ చిత్రానికి ఈ చిత్రానికి చాలా మార్పులు ఉండనున్నాయట. ఒరిజినల్ లూసిఫర్ లో హీరోయిన్ లేదు. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం హీరోయిన్ ని తీసుకోనున్నారు. అదలా ఉంచితే చిరంజీవి, మరో దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వెంకీమామాతో హిట్ సొంతం చేసుకున్న డైరెక్టర్ బాబీ చిరంజీవికి లైన్ వినిపించాడట.

 

బాబీ చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన చిరంజీవి పూర్తి స్క్రిప్టుని తీసుకురమ్మని చెప్పాడని టాక్. వెంకీమామా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయినా ఓ మోస్తారు విజయాన్ని అందుకున్న బాబీ. ప్రస్తుతం బాబీ బౌండెడ్ స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడట. మరి వీరిద్దరిలో ఎవరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడో అర్థం కాకుండా ఉంది. మరి ఆ ఇద్దరిలో చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి దక్కనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: