యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ మరియు గోపీ కృష్ణ మూవీస్‌ బ్యానర్లు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'సాహో' వంటి భారీ చిత్రం తరువాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌ లో నెలకొన్నాయి. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారట. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవల జార్జియా షెడ్యూల్‌ ముగించుకుని ఇండియాకి వచ్చింది.

 

అయితే ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారని.. పీరియాడిక్‌ నేపథ్యంలో వచ్చే ఓల్డ్ గెటప్ లో.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే డబుల్ లుక్స్ లో ప్రభాస్ ఫుల్ యాక్షన్ చేయనున్నాడట. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ చిత్రం అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ చిత్రంలో రొమాంటిక్ కంటెంట్ మాత్రమే కాకుండా మంచి యాక్షన్ కూడా ఉండనుంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ సినిమాలో సంగీతానికి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని కంఫర్మ్ చేస్తారో చూడాలి.

 

ఇదిలా ఉండగా ఇంకా పేరు ఖరారు చేయని ఈ చిత్రానికి 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అంనౌన్సమెంట్స్ ఉగాది కానుకగా ఇవ్వాలని చిత్ర యూనిట్ భావించారు. కానీ దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వలన ఏర్పడిన పరిస్థితుల వలన వాయిదా వేసుకున్నారు. అయితే రాబోయే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: