కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ఇప్పటికే ఈ సినీ రంగం వేల కోట్ల రూపాయల నష్టాలను చవిచూవిచూసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాల విషయంలో చేయడానికి ఏం లేకపోయినా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల విషయంలో మాత్రం నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్కు రెడీ గా ఉన్న సినిమాలను ఏదో ఒక ప్లాట్ ఫాంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. అందుకే ఓటీటీ ప్లాట్ ఫాంలలో సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కిన గులాబో సితాబో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే సమయంలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన బయోగ్రాఫికల్ ఫిలిం శకుంతలా దేవి సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సౌత్ లో కూడా మరికొన్ని సినిమాలను ఇదే బాటలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఈ లిస్ట్లోకి మరో సినిమా కూడా వచ్చి చేరింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వర్జిన్ భాను ప్రియా. ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మేము ప్రస్తుతం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం పరిస్థితులు, ఓటీటీల ద్వారా సినిమాకు వచ్చే లాభాల గురించి ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్లు తెరుచుకునే వరకు ఎదురుచూడటం కన్నా సినిమాలను డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయటమే కరెక్ట్ అన్న భావన కలుగుతుంది` అని చెప్పారు నిర్మాత మహేంద్ర దరివాల్. ఈ సినిమాలో ఊర్వశీతో పాటు గౌతమ్ గులాటీ, అర్చన పురాన్ సింగ్, రాజీవ్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు.