ప్రజెంట్ టాలీవుడ్లో మ్యారేజ్ సీజన్ నడుస్తోంది. ఇప్పటికే యువ కథానయాకుడు నిఖిల్ ఓ ఇంటి వాడు కాగా, మ్యాన్లీ స్టార్ రానా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పటికే పెళ్లి స్టార్ట్ చేసిన నితిన్, త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్గా ఉన్న మరి కొంత మంది హీరోలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రానా తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన వెంటనే మరో యువ హీరో వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించి కూడా న్యూస్ హల్చల్ చేస్తోంది. నాగబాబు త్వరలో నిహారిక, వరుణ్ తేజ్ ల పెళ్లి అంటూ ప్రకటించినట్టుగా వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తల పై ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్, నాగబాబు.. వరుణ్ తేజ్ పెళ్లి వార్తల గురించి మాట్లాడినట్టుగా ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన న్యూస్ స్క్రీన్ షాట్ను షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. `ఏంటి బావా నీకు పెళ్లంట..?` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ ట్వీట్పై వెంటనే స్పందిచిన వరుణ్ `దానికి ఇంకా చాలా టైం ఉందిలే కానీ మన రానా , నితిన్ మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటాం అని చెప్పి సింపుల్గా సింగిల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు` అంటూ ట్వీట్ చేశాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ప్రజెంట్ .. సోలో బ్రతుకే సో బెటరూ అనే మూవీ లో నటిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఇటీవల గద్దలకొండ గణేష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వరుణ్, ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ కారణంగా లేట్ అయ్యింది.
Enti bava @IAmVarunTej neeku pellanta? 😱😱😱 pic.twitter.com/0jEWbDe5PU
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020