వర్షం... ప్రభాస్ ని స్టార్ హీరో చేసిన సినిమా. ఆ సినిమా తర్వాత ప్రభాస్ అలాగే హీరోయిన్ త్రిష క్రేజ్ అనేది అమాంతం పెరిగిపోయింది అనే చెప్పుకోవచ్చు ఆ సినిమాలో వాళ్ళ నటన అలాగే ఆ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా మెప్పించాయి. ప్రేక్షకులకు ఆ సినిమా ఏ స్థాయిలో నచ్చింది అంటే ఆ సినిమా కోసం కొందరు ఆంధ్రా నుంచి తెలంగాణా వెళ్లి కూడా చూసారు అని చెప్తారు థియేటర్ లు లేక. చూసిన వాళ్ళే ఒకటికి రెండు సార్లు చూసారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక స్థాయిలో పెరిగింది అనేది వాస్తవం. 

 

ఆ సినిమాలో త్రిష నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పుకోవచ్చు. అలాగే ఆ సినిమాలో విలన్ గా నటించిన గోపి చంద్ కూడా చాలా బాగా నటించి మెప్పించారు ప్రేక్షకులను అని విమర్శకులు కూడా అన్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం అనేది దాదాపుగా రాలేదు అనే చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో వర్షం పడిన సందర్భంలో ఒక పాటలో హీరో హీరోయిన్ రోమాన్స్ అలాగే ఇద్దరూ ఒక గదిలో కూర్చున్న సమయంలో దాదాపుగా లిప్ లాక్ ఇచ్చుకున్న సన్నివేశం ప్రేక్షకులకు పిచ్చి ఎక్కించింది. 

 

ఆ సినిమాలో త్రిష ప్రభాస్ రోమాన్స్ ఎక్కువగా లేకపోయినా కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఇద్దరు బాగా రోమాన్స్ ని కళ్ళ తో కూడా పండించారు. కాగా ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను మహానటి దర్శకుడు తో ఒక సినిమా చేస్తారు. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: