టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీ తమన్నా తన అందచందాలతో పాటు అదిరిపోయే డాన్స్ తో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఎలాంటి స్టార్ డాన్సర్ అయినా అతని పక్కన ఈజీగా పోటీగా డాన్స్ వేస్తూ తనకంటూ స్పెషాలిటీ గుర్తింపు ప్రేక్షకుల్లో ఉండేలా తమన్నా డాన్స్ ఉంటుంది. అదేవిధంగా యాక్టింగ్ లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే తమన్నా దాదాపు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోల పక్కన నటించింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో సినిమా తారలంతా ఇళ్లకే పరిమితమై ఎవరికివారు వీడియో లు చేస్తూ ఇంటర్వ్యూ ఇస్తూ రకరకాలుగా లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. 

 

కొంతమంది అయితే తోట పని చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇంకొంతమంది అయితే భార్యలకు సహాయం చేస్తూ వీడియోలను సోషల్ మీడియా లో రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ టైం లో తమన్నా మాత్రం ఎక్కువగా కవితలు రాసిందట. తనలో ఒక కవిత్రి దాగి ఉందని ఇటీవల సోషల్ మీడియాలో ఓ అకౌంట్ లో వాల్​పై రాసుకుంది. ఇంకా ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇప్పుడేదో గ్యాప్ దొరికింద‌ని రాశా కానీ, చిన్నతనంలో కవితలు ఎక్కువగా రాసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 

 

​మనసు ప్రశాంతంగా హాయిగా ఉన్న టైంలో పెన్ను పేపరు పట్టుకొని కవిత్వాలు రాస్తాను అంటూ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన చిన్నతనంలో రాసుకున్న పాత కవితల్ని తిరిగి చదువుకుంటున్నాను అని...కొన్నింటిని చదువుతుంటే.. ఆ టైమ్ లో ఎందుకిలా రాశా? ఇది కూడా ఒక‌ కవితేనా? అని తెగ న‌వ్వొస్తొంది” అని పేర్కొంది త‌మన్నా. ఎక్కువగా చిన్నతనంలో నేను రాసిన మాట ఏంటో తెలుసా అని సంచలన సీక్రెట్ బయట పెట్టింది. చిన్ననాటి నుండి తన డైరీలో నేను అయోమయం లో ఉన్న అనే పదాన్ని ఎక్కువగా రాసినట్లు తమన్నా ఇటీవల స్వయంగా వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: