‘బాహుబలి’ సినిమా తో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ సెపరేట్ మార్కెట్ ‘బాహుబలి’ సినిమా తో ఏర్పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి కూడా 'బాహుబలి' సినిమా తో పెరిగింది. ఒకానొక సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ సినిమా ప్రేమికులు మాట్లాడుకోవాలంటే కేవలం బాలీవుడ్ గురించి మాట్లాడేవారు కాని 'బాహుబలి' పుణ్యమా అని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు కూడా మారుమ్రోగుతోంది. ఇదిలా ఉండగా బాహుబలి తర్వాత ప్రభాస్ అదే స్థాయిలో విజయం సాధించాలని యాక్షన్ ఓరియంటెడ్ సినిమా ‘సాహో’ చేయడం మనకందరికీ తెలిసిందే. 

 

సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ దాదాపు రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని రిలీజ్ అయిన మొట్టమొదటి షో కే అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకొంది. అభిమానులను ఫుల్ గా నిరుత్సాహ పరిచింది. దీంతో ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ వెరైటీ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అదే సమయంలో నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన ప్రభాస్, ఆ తరువాత టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. 

 

ఇటీవల లాక్ డౌన్ టైంలో ప్రభాస్ కోసం ఒక అదిరిపోయే స్టోరీ పూరి జగన్నాథ్ రెడీ చేశాడట. ఆల్రెడీ సినిమాకి సంబంధించి స్టోరీ లైన్ ప్రభాస్ కి వినిపించాడట. నచ్చడంతో మిగతా స్టోరీ ప్రభాస్ కి వినిపించడానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినపడుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏక్ నిరంజన్, బుజ్జిగాడు రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినాగాని డైరెక్టర్ పూరి ప్రభాస్ ని మాస్ హీరోగా అద్భుతంగా చూపించడం జరిగింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం ప్రభాస్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: