టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు వస్తున్నాయి అనగానే ప్రేక్షకుల్లో హీరో తో సమానంగా క్రేజ్ ఉంటుంది. అయితే అజ్ఞాత‌వాసి సినిమా తో పోయిన క్రేజ్ అంతా త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా చేసి కొంత వ‌ర‌కు తెచ్చుకున్నాడు. ఇక ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్‌ ఇమేజ్ డ‌బుల్ అయ్యింది. ఈ సినిమా నాన్ బాహుబ‌లి రికార్డులు అన్నింటికి పాత‌రేసేసింది.

 

అయితే ఇప్పుడు ఆయన మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. త్రివిక్రమ్ కొందరికి ఇచ్చిన మాట తప్పాడు అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. అసలు అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... త్రివిక్రమ్ ఎన్టీఆర్ కంటే ముందు మహేష్ బాబుకి మాట ఇచ్చాడని టాక్. మహేష్ బాబు ఆయన తో సినిమా చేయడానికి రెండేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు గాని.. మహేష్ బిజీ గా ఉండటం, అటు త్రివిక్రమ్ కూడా బిజీ గా ఉన్న నేపధ్యంలో అది సాధ్యం కావడం లేదు. ఖ‌లేజా త‌ర్వాత ఈ కాంబోలో సినిమా రాలేదు.

 

అయితే ఇప్పుడు ఇద్దరూ కూడా ఫ్రీ అయ్యారు. త్రివిక్రమ్ తో జనవరి లోనే మహేష్ బాబు మాట్లాడి సినిమాను ఓకే చెయ్యాలని ముందుకు వెళ్దామని అడిగాడట. ఇదే విషయాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ అధినేత రాధాకృష్ణ ను అడిగి చెప్తాను అని త్రివిక్రమ్ చెప్పాడట. ముందు మాట ఇచ్చారు కాబట్టి చేస్తారు అనుకున్నాడ‌ట మహేష్ బాబు. కాని ఎన్టీఆర్ తో చేసే సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ నుంచి ఆధికారిక ప్రకటన రావడం పై మహేష్ అసహనం వ్యక్తం చేసి ఆ తర్వాత జక్కన్న తో చర్చలు జరిపాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: