శ్రీనివాస కళ్యాణం సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ అంతకంత తన స్టామినా ఏంటో చూపించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ముందునుంచి ఉన్న అంచనాలను అందుకొని మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. చెప్పాలంటే నితిన్ చాలా సినిమాల తర్వాతే భీష్మ తో హిట్ దక్కింది. అంతే ఇక ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. ఈ సినిమా తర్వాత వరసగా సినిమాలని లైన్ లో పెట్టాడు ఈ యంగ్ హీరో. 

 

భీష్మ వంటి కమర్షియల్ హిట్ తర్వాత నిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన రొమాంటిక్ పోస్టర్ తో మంచి అంచనాలను పెంచింది. వరుణ్ తేజ్ తొలిప్రేమ, అఖిల్ అక్కినేని మజ్ను ల ఫేం వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా జూలై లో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రంగ్ దే రిలీజ్ అయ్యో అవకాశాలున్నాయని తాజా సమాచారం. 

 

ఇక నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోను ఒక ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ లు కూడా పూర్తి చేసుకుంది. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌ నితిన్‌కు జోడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు పాటు నితిన్ హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అంధధూన్ రీమేక్‌లోనూ నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇనాళ్ళు లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమాలు ఒక్కొక్కటిగా మళ్ళీ పట్టాలెక్కబోతున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: