యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సుజిత్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండటంతో సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయినాగానీ సుజిత్ డైరెక్షన్ కి మంచి పేరు వచ్చింది. మొదటి సినిమా రన్ రాజా రన్ సినిమా తో అదిరిపోయే విజయాన్ని దక్కించుకుని ఏకంగా రెండో సినిమా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం సాధించారు. అయితే ఇప్పుడు తాజాగా మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవి తో చేయటానికి అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ ఈ సినిమా రైట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఆ సమయంలో రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారని అందరూ భావించారు. కానీ ఈ సినిమా రైట్స్ తన తండ్రి చిరంజీవి కోసం దక్కించుకున్నట్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్వయంగా ఈ సినిమాని చరణ్ నిర్మించాలని భావించిన తరుణంలో సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ తెలుగు నేటివిటీకి నచ్చేలా డైరెక్టర్ గా సుజిత్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో సుజిత్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు స్టోరీ మర్చి చిరంజీవికి ఫుల్ స్క్రిప్ట్ వినిపించారట. అయినా కానీ చిరంజీవి స్క్రిప్టులో ఇంకా మార్పులు ఉండాలని డైరెక్టర్ సుజిత్ కి పరీక్షలు మీద పరీక్షలు పెడుతున్నారట.

 

మరి ఫుల్ స్క్రిప్ట్ తో డైరెక్టర్ సుజిత్ చిరంజీవిని మెప్పిస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆశ్చర్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు సగానికిపైగా పూర్తయింది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే జూన్ నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవ్వబోతున్నట్లు దీంతో ఈ సినిమా అయిన వెంటనే లూసిఫర్ రీమేక్ సినిమా చిరంజీవి చేయనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: