ఏంటి? ఏం అంటున్నారు? పూరి జగన్నాథ్ చిత్రంతో ఛార్మి జీవితం మారిపోయిందా? ఎలా? ఎప్పుడు మారింది? ఎందుకు మారింది అని మీకు అనిపించచ్చు కానీ నిజంగానే ఛార్మి జీవితం మారిపోయింది. ఆ సినిమానే జ్యోతి లక్ష్మి. అదేంటి? ఆ సినిమాతో ఛార్మి జీవితం ఎలా మారిపోయింది? అని మీకు అనిపించచ్చు.. అక్కడికే వస్తున్న. 

 

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. జ్యోతి లక్ష్మి సినిమా కోసం ఛార్మిని పూరి జగన్నాథ్ కలిశాడు అని.. అప్పటికే పూరి జగన్నాథ్ కి ఛార్మికి పరిచయం ఉండటంతో ఛార్మికి జ్యోతి లక్ష్మి రోల్ నచ్చి ఆ సినిమాకు ఆమె నిర్మాతగా మారింది.. ఆ తర్వాత సినిమాలు మానేసి పూరి జగన్నాథ్ చుట్టూనే తిరుగుతుంది అని ఆ కథనంలో ఉంది. 

 

అయితే నిజానికి అప్పటికే పూరి జగన్నాథ్ సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి. ప్లాప్ అవుతూనే ఉన్నాయ్. ఇంకా జ్యోతి లక్ష్మి సినిమా కూడా వాళ్ళు ఊహించినంత హిట్ అయితే కొట్టలేదు. దీంతో ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా అంటే పూరి జగన్నాథ్ తీసిన సినిమాలు అన్నింటికి కూడా ఛార్మినే నిర్మాతగా వ్యవహరించింది. 

 

జ్యోతి లక్ష్మి సినిమా తర్వాత.. రోగ్, పైసా వసూల్, మహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, ఇప్పుడు ఫైటర్ అన్ని సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఆమె నిర్మించిన 4 చిత్రాల్లో ఒకటి హిట్ అయ్యింది. అదే ఇస్మార్ట్ శంకర్. ఇప్పుడు విజయ దేవరకొండతో ఫైటర్ సినిమా తీస్తుంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మి సినిమాతో ఛార్మి నిర్మాతగా మారింది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: