కామెడీ సినిమాలతో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్న హీరో శ్రీను వైట్ల. స్టార్ హీరోలతో కూడా కామెడీ సక్సెస్లు అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగిన శ్రీనువైట్ల ప్రస్తుతం ఒక్క సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే కెరీర్ లో మంచి ఫాంలో ఉండగా శ్రీనువైట్ల ఓ హీరోయిన్ను రిపీట్ చేశాడు. అది కూడా ఇద్దరు టాప్ హీరోల సినిమాల్లో కావటం విశేషం.
శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కింగ్. నాగార్జున మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మలయాళ నటి మమతా మోహన్ దాస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా చెన్నై చంద్రం త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో త్రిష కామెడీ కూడా ఓ రేంజ్లో పండించింది. అందుకే కింగ్ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. అందుకే ఈ సినిమాతో త్రిష శ్రీనువైట్లకు లక్కీ గర్ల్ అనిపించుకుంది.
కింగ్ తరువాత మరోసారి త్రిషతో సినిమా చేశాడు శ్రీను వైట్ల. కింగ్ లో కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ కావటంతో మరోసారి అదే తరహా పాత్రలో నటించారు. మరో సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నమో వెంకటేశ సినిమాలో హీరోయిన్గా నటించింది త్రిష. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు కూడా మంచి రిజల్ట్ రావటంతో త్రిష నిజంగానే శ్రీను వైట్లకు లక్కీ గర్ల్గా ప్రూవ్ చేసుకుంది. అయితే ఆ తరువాత శ్రీను వైట్ల భారీ చిత్రాల చేయటం, త్రిష కూడా టాలీవుడ్కు బ్రేక్ ఇచ్చి చెన్నై వెళ్లిపోవటంతో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు.