రెబల్ స్టార్ ప్రభాస్ తన 20వ చిత్రం లో రెండు గెటప్ లలో కనిపించనున్నాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో  ఒకటి ఓల్డ్ లుక్ లో కనిపించనుండగా ప్రస్తుత కాలానికి సంబంధించి ప్రభాస్ మరో గెటప్ లో కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. థ్రిల్లింగ్ లవ్ స్టోరీ తో కమర్షియల్  ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ ప్రచారంలో వుంది అయితే సినిమా ప్రారంభమై రోజులు గడుస్తున్నాఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు దాంతో ప్రభాస్ అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ పై ఆగ్రహం గా వున్నారు.  
 
జిల్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తుండగా ముంబై బ్యూటీ  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు, హిందీ నటి భాగ్య శ్రీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తోపాటు తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం లో విడుదలకానుంది.  
 
ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 400కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనునున్నాడు. ఈ ఏడాది  ఆగస్టు లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా 2022 లో ప్రేక్షకులముందుకు రానుంది. భారత సినీ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా  భారీ గ్రాఫిక్స్  తో ఈసినిమా  తెరకెక్కనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: