అక్కినేని మనం తర్వాత సినీ పరిశ్రమలో ఉన్న అన్ని పెద్ద ఫ్యామిలీలు మాకు అలాంటి ఓ కథ పడితే బాగుండు అనుకున్నారు. మనం కేవలం అక్కినేని ఫ్యామిలీ కథ. ఆ సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. వేరే దగ్గర రీమేక్ కోసం నాగార్జునకు ఎంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినా సరే ఇవ్వనని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఏయన్నార్ నటించిన చివరి సినిమా ఓ జ్ఞాపకంగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే అలానే దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ ఇలా అందరు అలాంటి మల్టీస్టారర్ కథ కోసం ఎదురుచూస్తున్నారు. 


అయితే మల్టీస్టారర్ కథ అంటే మామూలు విషయం కాదు అందుకే కొందరు రీమేక్ ల మీద దృష్టి పెడుతున్నారు. ఇక లేటెస్ట్ గా దగ్గుబాటి ఫ్యామిలీ మల్టీస్టారర్ సినిమా తెర మీదకు వచ్చింది. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం సినిమా రీమేక్ ను వెంకటేష్, రానాలు తీసేలా చర్చలు జరుగుతున్నాయట. హారిక హాసిని, సురేష్ ప్రొడక్షన్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారట. మలయాళంలో సాచి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా అయ్యప్పనుమ్ కోషియం ఈ సినిమాలో పృథ్విరాజ్ పాత్రలో రానా, బిజూ మీనన్ పాత్రలో వెంకటేష్ నటిస్తాడని అంటున్నారు. 


అసలైతే బాలకృష్ణ, రానాసినిమా చేస్తారని అన్నారు కానీ బాలయ్య బాబు ఈ రీమేక్ కు నో చెప్పినట్టు తెలుస్తుంది. వెంకటేష్, రానా కలిసి ఈ రీమేక్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి దగ్గుబాటి మల్టీస్టారర్ గా ఈ సూపర్ హిట్ రీమేక్ సెన్సేషనల్ కానుంది. మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు.ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.                         

మరింత సమాచారం తెలుసుకోండి: