ప్రార్ధన ప్రతి రూపాయికి లెక్కుంటుంది .. అంటూ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో సందడి చేసి టాలీవుడ్ దృష్ఠిని ఆకర్షించింది రకుల్ ప్రీత్ సింగ్. సందీప్ కిషన్ తో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దాదాపు నాలుగేళ్ళు రకుల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా తర్వాత వరసగా తెలుగులో స్టార్స్ సరసన నటించి సూపర్ హిట్స్ అందుకుంది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత కెరీర్ ఒక్కసారిగా తిరగబడింది. రకుల్ నటించిన సినిమాలన్ని వరసగా ఫ్లాపవడంతో టాలీవుడ్ లో క్రేజ్ తగ్గిపోయింది. 

 

ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జున మన్మధుడు 2 కూడా నిరాశ పరచింది. దాంతో రకుల్ కి సినిమాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వస్తుందని ధీమాగా ఉంది. అంటే ఒకరకంగా నితిన్ మీద తన సినిమా హిట్ మీదే రకుల్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పాలి.  అయితే అది టాలీవుడ్ లో మాత్రమే. కోలీవుడ్ బాలీవుడ్ కలిపి రకుల్ చేతిలో 5 సినిమాల వరకు ఉన్నాయి. వాటిలో మూడు హింది సినిమాలు,  రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా. తెలుగు సినిమాలో నితిన్ హీరోగా చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనే రకుల్ నటిస్తుంది. ఇక శంకర్ కమల్ హాసన్ ల భారతీయుడు 2 లో కూడా రకుల్ నటిస్తుంది. ఇది పాన్ ఇండియా సినిమా అన్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పటికే నితిన్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: