టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సక్సస్ తో మళ్ళీ ఫుల్ ఫాంలోకి వచ్చేశాడు. వరసగా సినిమా తర్వాత సినిమాని చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే నితిన్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోను ఒక  సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

 

ఈ సినిమాలతో పాటు  నితిన్ హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన అంధాధూన్ రీమేక్‌లోనూ నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇనాళ్ళు లాక్ డౌన్ కారణంగా నిలిచిన ఈ సినిమాని త్వరలో పట్టాలెక్కించాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఇప్పుడు నితిన్ కి ఒక పెద్ద సమస్య వచ్చి పడిందని తెలుస్తుంది. బాలీవుడ్ లో సంచలన విజయం అందుకున్న అంధాధున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. ఈ సినిమా తో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు ను దక్కించుకున్నాడు. దాంతో ఆ పాత్ర చేయడానికి మన యంగ్ హీరో నితిన్ ఉత్సాహం చూపించాడు. 

 

అయితే ఈ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ కి నటీనటులని ఎంచుకోవడం పెద్ద ఛాలెంజింగ్ గా మారిందని తెలుస్తోంది. అంధాధున్ లో కీలకపాత్రలో టబు నటించింది. అయితే ఆ పాత్రకి ఇక్కడ ఎవరిని ఎంచుకోవాలో సందిగ్ధం నెలకొంది. అలాగే హీరోయిన్ గా ఇప్పటి వరకు ఎవరిని ఎంచుకోవాలో తెలియని పరిస్థితి ఉందట. కథ ప్రకారం హీరో హీరోయిన్స్ మధ్య  డీప్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఆ సీన్స్ చేయడానికి తెలుగులో ఏ హీరోయిన్ ఒప్పుకుంటుందో అన్న డైలమాలో ఉన్నారట హీరో అండ్ డైరెక్టర్. ఇక ఇదే పాత్రని హిందీలో రాధిక ఆప్టే పోషించింది. ఇక నితిన్ కి ఈ పాత్ర పెద్ద సవాల్ గా మారనుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: