స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలంటే బోల్డంత ఎక్స్ పీరియన్స్ కావాలి. బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ బస్టర్స్ ఉండాలి. అప్పుడే టాప్ హీరోలు కాల్షీట్స్ఇస్తారని ఇండస్ట్రీలో ఓ ఒపినీయన్ ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ఈ మాటలను చెరిపేస్తున్నారు. ఒకటి రెండు సినిమాల అనుభవంతోనే స్టార్స్ తో సినిమాలు తీస్తున్నారు.

 

బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ తర్వాతి లెవల్ కు వెళ్లింది. పాన్ ఇండియన్ హీరోగా భారీగా సౌండ్ చేస్తూ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. ఇక ఈ మిర్చిని డైరెక్ట్ చేసేందుకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకే ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

 

ప్రభాస్ బాహుబలి డైరెక్షన్ లో సాహో చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. దీంతో మార్కెట్ ను కాపాడుకోవడానికి ప్రభాస్ తర్వాత ఓ పెద్ద దర్శకుడితో సిినిమా చేస్తాడేమో అని ట్రేడ్ వర్గాలు లెక్కలేశాయి. కానీ ప్రభాస్ మాత్రం రాధాకృష్ణ కుమార్ కు కాల్షీట్స్ ఇచ్చాడు. ఓ వింటేజ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. 

 

జెర్సీతో ఎమోషనల్ హిట్ కొట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సక్సెస్ తోనే బాలీవుడ్ కు కూడా వెళ్లాడు గౌతమ్. అక్కడ షాహిద్ కపూర్ తో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్ లో ఉండగానే గౌతమ్ భారీ ప్రాజెక్టులకు స్క్రిప్టులు సిద్ధం చేశాడనే టాక్ వస్తోంది. రామ్ చరణ్ కోసం స్టోరీ ప్రిపేర్ చేశాడనే ప్రచారం జరుగుతోంది. 

 

రామ్ చరణ్ ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తాడు. కానీ గౌతమ్ తాను తీసిన రెండు సినిమాలు మళ్లీరావా, జెర్సీతో టాలెంటెడ్ అనిపించుకున్నాడు. అందుకే బాలీవుడ్ లోనూ జెర్సీ రీమేక్ చేస్తున్నాడు. ఈ కంటెంట్ తోనే చరణ్ ని ఇంప్రెస్ చేయబోతున్నాడట గౌతమ్ తిన్ననూరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: