కరోనా అందిరనీ డిస్టర్బ్ చేసింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీని అతలాకుతలం చేసింది. సమ్మర్ కు వద్దామని కొందరు.. దసరాకు రావాలని ఇంకొందరు.. సంక్రాంతికి మరికొందరు టార్గెట్ చేశారు. వీళ్ల లక్ష్యాలన్నింటినీ కరోనా పటాపంచలు చేసింది. 

 

2021 సంక్రాంతి గురించి మన హీరోలు ఎన్నో కలలు కన్నారు. ఈ ఏడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో సూపర్ హిట్ కావడంతో.. ఇద్దరు కాదు.. ముగ్గురు స్టార్స్ వచ్చినా నష్టం లేదని భావించారు. దీంతో వారు ఎవరికి వారు సినిమాలు మొదలు కాకపోయినా నలుగురు స్టార్స్ వచ్చే సంక్రాంతిపై ఖర్చీఫులు వేసేశారు. ఈలోగా కరోనా ఎంట్రీతో అందరి కలలు చెల్లాచెదురైపోయాయి. 2021 సంక్రాంతికి ప్లాన్ చేసిన హీరోల్లో ఒక్కరూ రావడం లేదు. రారనుకున్న ఇద్దరు స్టార్స్ వస్తున్నారు. 

 

సమ్మర్ తర్వాత..సంక్రాంతికి ముందు వచ్చే పెద్ద సినిమా పండుగ దసరా. ఈ దసరాకు ప్రభాస్.. చిరంజీవి సినిమాలు రావాల్సి ఉండగా వాయిదాలు పడ్డాయి. సమ్మర్ లో మే 15న రావాల్సిన పవ్ కళ్యాణ్ వకీల్ సాబ్ వాయిదా పడింది. థియేటర్స్ ఆగస్ట్ లో ఓపెన్ అయితే.. బ్యాలెన్స్ ఉన్న పార్ట్ పూర్తి చేసి.. దసరాకు రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో నిర్మాత ఉన్నారట. 

 

అల వైకుంఠపురములో రిజల్ట్ తో బన్నీకి సంక్రాంతి ఫేవరేట్ ఫెస్టివల్ అయిపోయింది. సుకుమార్ సినిమా పుష్ప రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ లో మొదలుపెట్టి.. సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాడు. మళ్లీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. రెండు మూడు నెలల్లోనే షూటింగ్ స్టార్ట్ చేసినా.. సినిమా పూర్తయి రిలీజ్ కావాలంటే 2021 సమ్మర్ వరకు ఆగాల్సిందే. 

 

సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో సందడి చూసిన తర్వాత ఎన్టీఆర్ సైతం సంక్రాంతికే రావాలనుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తే.. కరోనా మరోలా ప్లాన్ చేసింది. సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు. జనవరి 8న రావాల్సిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ కూడా వాయిదా పడింది. 2021 సమ్మర్ కు వెళ్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: