మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప‌రంగా రీ ఎంట్రీ ఇచ్చాక స‌రికొత్త జోష్ తో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత 2017లో ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమాతో తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. అది రీమేక్ సినిమా అయినా కూడా తిరుగులేని వ‌సూళ్లు రావ‌డంతో పాటు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. దీంతో ప‌దేళ్లు చిరు సినిమాలు చేయ‌క‌పోయినా ఆయ‌న క్రేజ్‌, ఛ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ అయ్యింది. 

 

ఆ త‌ర్వాత ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సైరా న‌ర‌సింహా రెడ్డి సినిమాలో కూడా చిరంజీవి న‌టించాడు. ఈ సినిమా విమ‌ర్శ‌ల ప‌రంగా చిరంజీవికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు సాధించి పెట్టింది. ఈ సినిమాలో సైరాగా చిరు చేసిన న‌ట‌న అసామాన్యం అనే చెప్పాలి. అయితే క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం అంచ‌నాలు అందుకోలేదు. ఈ సినిమా త‌ర్వాత చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

సినిమా ఇప్ప‌టికే స‌గ భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ విష‌యంలో త్రిష అని.. న‌య‌న‌తార అని.. కాజ‌ల్ అగ‌ర్వాల్ అంటూ ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవ్వ‌రూ ఫైన‌లైజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ విష‌యంలో చిరంజీవికి .. ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య చిన్న పొరా పొచ్చ‌లు వచ్చాయ‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. చ‌ర‌ణ్ ఇప్ప‌టికే మ‌ళ‌యాళ హిట్ మూవీ లూసీఫ‌ర్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడ‌ట‌. 

 

సినిమా రీమేక్ చేద్దామ‌ని చ‌ర‌ణ్ ప‌ట్టుబ‌డుతున్నా.. చిరుకు మాత్రం ఆ ఉద్దేశం లేద‌ని టాక్‌. చిరు మాత్రం వ‌రుస రీమేక్‌లు చేస్తే ఇబ్బంది అవుతుంద‌ని.. తెలుగు క‌థ‌తోనే సినిమా చేద్దామ‌ని ప‌ట్ట‌బ‌డుతున్నాడ‌ట‌. మ‌రి ఈ విష‌యం వీరిద్ద‌రు ఎలా ప‌రిష్క‌రించుకుంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: