మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పరంగా రీ ఎంట్రీ ఇచ్చాక సరికొత్త జోష్ తో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అది రీమేక్ సినిమా అయినా కూడా తిరుగులేని వసూళ్లు రావడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో పదేళ్లు చిరు సినిమాలు చేయకపోయినా ఆయన క్రేజ్, ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదని ఫ్రూవ్ అయ్యింది.
ఆ తర్వాత ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా చిరంజీవి నటించాడు. ఈ సినిమా విమర్శల పరంగా చిరంజీవికి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టింది. ఈ సినిమాలో సైరాగా చిరు చేసిన నటన అసామాన్యం అనే చెప్పాలి. అయితే కమర్షియల్ గా మాత్రం అంచనాలు అందుకోలేదు. ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇప్పటికే సగ భాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో త్రిష అని.. నయనతార అని.. కాజల్ అగర్వాల్ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ విషయంలో చిరంజీవికి .. ఆయన తనయుడు రామ్ చరణ్ మధ్య చిన్న పొరా పొచ్చలు వచ్చాయన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. చరణ్ ఇప్పటికే మళయాళ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేశాడట.
ఈ సినిమా రీమేక్ చేద్దామని చరణ్ పట్టుబడుతున్నా.. చిరుకు మాత్రం ఆ ఉద్దేశం లేదని టాక్. చిరు మాత్రం వరుస రీమేక్లు చేస్తే ఇబ్బంది అవుతుందని.. తెలుగు కథతోనే సినిమా చేద్దామని పట్టబడుతున్నాడట. మరి ఈ విషయం వీరిద్దరు ఎలా పరిష్కరించుకుంటారో ? చూడాలి.