చిరంజీవి ఇప్పటివరకు నటించిన 151 సినిమాలలో ఎందరో క్రేజీ హీరోయిన్స్ తో నటించినా విజయశాంతి చిరంజీవిల కాంబినేషన్ కు వచ్చినంత క్రేజ్ మరే కాంబినేషన్ కు రాలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో 21 సినిమాలు వస్తే వాటిలో అనేకసినిమాలు సూపర్ హిట్ కావడమే కాకుండా అవి ఇప్పుడు టీవీలలో ప్రసారం అయినా జనం ఇప్పటికీ క్రేజీగా చూస్తూనే ఉన్నారు.


‘పసివాడి ప్రాణం’ ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ ‘స్వయం కృషి’ ‘ఛాలెంజ్’ ‘గ్యాంగ్ లీడర్’ వరకు వీరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ గా కొనసాగింది. అయితే ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన చిన్నచిన్న సమస్యలు ఇగో సమస్యలుగా మారాయి. ఆతరువాత వీరిద్దరూ రాజకీయాలలోకి రావడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిపాయింది.


ఇలాంటి పరిస్థితులలో కొన్నిసంవత్సరాల గ్యాప్ తరువాత చిరంజీవి విజయశాంతిలు ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ఫంక్షన్ లో కలిసినప్పుడు భావోద్వేగంతో వీరు ఒకరి పై ఒకరు చేసుకున్న కామెంట్స్ వీరిద్దరి సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ ను తెలుగులో తీయబోతున్న దర్శకుడు సుజిత్ కు ఒక ఆలోచన వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఫైనల్ చేస్తున్న సుజిత్ కు స్క్రిప్ట్ కు సంబంధించి ‘లూసిఫర్’ సినిమాలో మంజు వారియర్ పాత్ర కీలకమైన పరిస్థితులలో ఆపాత్రను తెలుగులో విజయశాంతి చేత చేయిస్తే ఎలా ఉంటుంది అన్నఆలోచన వచ్చినట్లు టాక్.


ఈఆలోచనలకు చిరంజీవి నుండి కూడ సానుకూల స్పందన రావడంతో సుజిత్ విజయశాంతిని ఈవిషయం పై కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుజిత్ రాయబారాలకు విజయశాంతి నుండి పెద్దగా స్పందన రావడంలేదనీ అంతేకాకుండా తాను అనీల్ రావిపూడి పట్టుదల వల్ల ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటించిన విషయాన్ని వివరిస్తూ సుజిత్ రాయబార విషయంలో తనకు ఆలోచించుకోవడానికి కొంత సమయంకావాలి అంటూ చెప్పినట్లు గాసిప్పులు వస్తున్నాయి. దీనితో సుజిత్ ఉత్సాహం నీరు కారిపోయిందని బహుశా మళ్ళీ చిరంజీవి విజయశాంతిల కాంబినేషన్ రిపీట్ అవ్వడం కష్టమే అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఈవార్తల పై అభిప్రాయపడుతున్నాయి..    

మరింత సమాచారం తెలుసుకోండి: