మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదం అందించడమే కాదు కొత్త విషయాన్ని వాళ్లకు చెప్పాయి అనేది వాస్తవం. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన కథ అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కథ లో ఉండే కొన్ని కొన్ని కోణాలు కొన్ని కొన్ని సన్నివేశాల్లో నటులు ప్రవర్తించే తీరు అన్ని కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. 

 

ఇక రాజేంద్ర ప్రసాద్ పాత్ర అయితే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉండే మెసేజ్ ఏంటీ అనేది చూస్తే ఆస్తులు కాదు ముఖ్యం పేరు... సమాజంలో ఒక పేరు అనేది మనకు ఉండాలి అనే విధంగా ఈ సినిమా  కథ ఉంటుంది. ఆస్తులు ఏ విధంగా ఉన్నా సరే సమాజంలో ఒక విలువ లేకపోతే మాత్రం కష్టం అనే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇక భార్యా భర్తలు కూడా కలిసి ఉండాలి అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. అదే విధంగా తండ్రి పేరు ని వారసులు ఏ విధంగా కాపాడాలి అనేది కూడా ఈ సినిమాలో చాలా అందంగా చూపించాడు దర్శకుడు. 

 

సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో బాగా పెరిగింది అనే చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అతను చేసిన సినిమాలు దాదాపుగా విజయం సాధించాయి. ప్రస్తుతం అతను పుష్ప అనే సినిమాలో సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: