మన తెలుగులో గత పదేళ్ళలో వచ్చిన అందమైన సినిమాల్లో కచ్చితంగా చెప్పుకునే సినిమా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. శర్వానంద్ నిత్యా మీనన్ హీరో హీరోయిన్ లు గా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా యువతనే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా హాల్ లో కూర్చో పెట్టింది అనేది వాస్తవం. ఈ సినిమాలో ముఖ్యంగా శర్వానంద్ నటన తో పాటుగా నిత్యా మీనన్ మాటలు ప్రేక్షకులకు ఎంత బాగానో నచ్చాయి. ఆమె అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో జీవించింది అనే చెప్పవచ్చు. 

 

ఈ సినిమాలో ప్రేమ కోసం ఎన్ని రోజులు అయినా ఎదురు చూడవచ్చు  అనేది చూపిస్తారు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే ప్రేమించిన వాడు కావాలి అనుకుంటే ఎక్కడి వరకు అయినా వెళ్ళవచ్చు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది. హీరో హీరోయిన్ లు అదే విధంగా నటించారు ఈ సినిమాలో. క్రాంతి మాధవ్ కూడా ప్రతీ సన్నివేశాన్ని చాలా జాగ్రత్తగా చూపించడమే కాదు రాసిన మాటలు కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి అనేది నిజం. ఈ సినిమాలో శర్వానంద్ నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి అని చెప్పవచ్చు. 

 

నిత్యా మీనన్ రేంజ్ కూడా ఈ సినిమా తర్వాత పెరిగింది అనే చెప్పవచ్చు. ఆమెకు అక్కడి నుంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. అయినా సరే ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె ఒక రెండు సినిమాలు చేస్తుంది. తెలుగులో కూడా ఆమెకు మంచి ఆఫర్లు ఉన్నా సరే కొన్ని కొన్ని పాత్రలు ఆమెకు నచ్చక సినిమాలు చేయడం లేదు. బొద్దు గా ఉన్నా సరే అందంగా నటించడం తో ఆమెకు ఆఫర్లు భారీగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: