మహానటి.. టాలీవుడ్ లో ఈ సినిమా సంచలనం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ రేంజ్ తో పాటుగా దర్శకుడు నాగ్ అశ్విన్ రేంజ్ కూడా ఏ స్థాయిలో పెరిగింది అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో ప్రధానంగా కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే సావిత్రిని కీర్తి లో చూసే విధంగా చేసాయి. మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు కూడా సినిమా ఒక రేంజ్ లో ఉంది అనే విధంగా ఉన్నాయి సన్నివేశాలు. ఒక హీరోయిన్ అంతకు మించి చేయలేదు అనే విధంగా కీర్తి సురేష్ చేసింది. 

 

ఇక అది పక్కన పెడితే ఆ సినిమాలో కీర్తి నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. సినిమా అటు తమిళంలో కూడా చాలా బాగా ఆడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉన్న మెసేజ్ గురించి ఒక్కసారి చూస్తే.. ఒక హీరోయిన్ లేదా ఒక మహిళ లేదా సమాజంలో పేరు తెచ్చుకున్న మహిళ ఏ విధంగా నిలబడాలి అనేది సావిత్రి జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఎంతో పేరు వచ్చినా సరే ఆమె చేసిన చిన్న తప్పు జీవితాన్ని నాశనం చేసింది. ప్రేమకు ఆకర్షణ అయి... ఆమె అనవసరంగా జీవితాన్ని నాశానం చేసుకుంది.

 

ఈ సినిమాలో ప్రతీ సీన్ కూడా సావిత్రి జీవితాన్ని చాలా బాగా చూపిస్తే మహిళలు తమకు ఒక స్థాయి వచ్చిన తర్వాత వేసే అడుగుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపించింది. కాగా కీర్తి సురేష్ ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల మరో సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కాగా తెలుగులో ఆమె రెండు సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: