టాలీవుడ్ బుల్లితెర యాంకర్స్ లో శ్యామల ఒకరు. తెలుగులో టాప్ యాంకర్స్ లో ఒకరైన శ్యామల వరుస ఛాన్సులు అందుకుంటుంది. టివి షోలే కాదు, సినిమా ఈవెంట్లను సైతం చేస్తూ వస్తున్న శ్యామల లాక్ డౌన్ టైం లో  ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చాట్ చేసింది. అందులో భాగంగా యాంకర్ శ్యామల తన లవ్ స్టోరీ కూడా షేర్ చేసుకుంది. ఒక సినిమాకు సరిపడేలా శ్యామల లవ్ స్టోరీ ఉందని చెప్పొచ్చు. అదేంటి అంటే.. శ్యామల, తన భర్త నరసింహని లవ్ మ్యారేజ్ చేసుకుంది. 


నరసింహాతో ప్రేమలో పడ్డ శ్యామల తన ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చి పెళ్లి చేసుకుందట. ఆ టైం లో నరసింహ ఫ్యామిలీ వారి పెళ్ళికి సపోర్ట్ గా ఉన్నారట. శ్యామలకు బాబు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. తనది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని చెప్పిన శ్యామల పెళ్లి తర్వాత లైఫ్ చాలా బాగుందని.. తన భర్త తనని బాగా చూసుకుంటాడని చెప్పుకొచ్చింది. యాంకర్ గా పాపులర్ అయిన శ్యామల బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ 2లో స్టార్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్యామల ఐదారు వారాలకే ఎలిమినేటి అయ్యింది. 


లాక్ డౌన్ టైం లో ఫ్యామిలీకి ఫుల్ టైం కేటాయిస్తున్నా అని చెప్పిన శ్యామల ఎప్పుడు ఏదో ఒక వర్క్ తో బిజీగా ఉండే తాను ఇన్నిరోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుందని అసలు ఊహించలేదని అంటుంది. టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో శ్యామల కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. తప్పకుండా ఆమె మరిన్ని రోజులు సత్తా చాటుతుందని చెప్పొచ్చు. లాక్ డౌన్ తర్వాత సరికొత్త షోతో తాను ప్రేక్షకుల ముందుకు వస్తానని చెబుతుంది శ్యామల. 

మరింత సమాచారం తెలుసుకోండి: