కట్టుకున్న కృష్ణగారి అబ్బాయి నుంచి ప్రిన్స్ మహేశ్.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు అయిపోయాడు. లాక్ డౌన్ పరిస్థితుల్లో టాలీవుడ్ లో మరే హీరోకు దక్కని అదృష్టం పొందాడు. లాక్ డౌన్ వల్ల అందరి హీరోల సినిమాలు మధ్యలో ఆగిపోయి ఎంతోకొంత సినిమా టెన్షన్ ఉండి ఉంటుంది. కానీ.. మహేశ్ సరిలేరు నీకెవ్వరు తర్వాత మరే సినిమా మొదలు పెట్టలేదు. ఈలోపు పరిస్థితులు మారిపోయాయి. దీంతో మహేశ్ ఇంట్లోనే ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపించడంతో తన కొత్త సినిమా ప్రారంభించేందుకు సిద్దమవుతున్నాడు.

 

 

దర్శకుడు పరశురామ్ తో మహేశ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్ తండ్రి హీరో కృష్ణ పుట్టినరోజు మే 31న మైత్రీ మూవీస్ ఆఫీస్ లో పూజా కార్యక్రమం చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని అంటున్నారు. ఎటువంటి హడావిడి లేకుండా ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. ప్రతి ఏడాది తండ్రి పుట్టినరోజున తన సినిమా గురించి ఏదొక అప్డేట్ ఇవ్వడం మహేశ్ కు అలవాటు. ఈసారి కూడా మహేశ్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. మహేశ్ సినిమాకు ఎప్పుడెప్పుడు కొబ్బరికాయ కొడతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో మహేశ్ అభిమానుల సందడి షురూ కానుంది.

 

 

సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ ఎవరూ ఇంకా నిర్ణయం కాలేదు. షూటింగ్స్ ప్రారంభమయ్యే లోపు నటీనటులు, టెక్నీషియన్లను ఎంపిక చేసి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మహేశ్ అభిమానులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని ఇదివరకే స్పష్టం చేశాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమాకు సంగీతం థమన్ అందించే అవకాశం ఉందని అంటున్నారు. గోపీ సుందర్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు మేకర్స్ రివీల్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: