ఇప్పుడు మన తెలుగులో వచ్చే సినిమాలు అన్నీ కూడా చాలా వరకు రెగ్యులర్ గా ఉండటం లేదు. అగ్ర హీరోలు కూడా చాల జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చూపించడం లేదు. కథల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు మన హీరోలు అనేది వాస్తవం. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఇప్పుడు కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ లో ఖాళీ గా ఉన్న హీరోలు కథల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్. 

 

ఒక చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరూ కూడా కథల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని సమాచారం. ప్రస్తుతం మన తెలుగులో వచ్చే సినిమాలు అన్నీ  మార్కెట్ మీద దృష్టి పెట్టి వస్తున్నావే. అందుకే కథలను పాన్ ఇండియా వైడ్ గా ఉండే విధంగా జాగ్రత్తలు పడుతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు హిట్ కావాలి అంటే కచ్చితంగా సినిమాల కథల్లో మార్పులు ఉండాలని ఉత్తరాదికి తగిన విధంగా కథలు ఉండాలి అని భావిస్తున్నారు. 

 

అందుకే చేసే సినిమా కథలను పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు హీరోలు. మరి ఏ ఏ సినిమాల కథలు మారుస్తారో చూడాలి. అయితే దీనిపై ఇప్పుడు దర్శక నిర్మాతల నుంచి అసహనం వ్యక్తమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. వారికి కథలను మార్చడం ఏ విధంగా కూడా ఇష్టం లేదని సమాచారం. ఇదే విషయాన్ని హీరో ల మొహం మీదే చెప్పేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు చాలా వరకు కష్టపడుతున్నారు కథలు మార్చడానికి. చిరంజీవి ఎక్కువగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. చూద్దాం

మరింత సమాచారం తెలుసుకోండి: