టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ లకు భవిష్యత్తు లేదా తక్కువకు సినిమా ఎవరు చేస్తే వారితోనే సినిమాను చేస్తారా నిర్మాతలు... అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఇప్పుడు నష్టాల్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు హీరోలు దర్శకులు నిర్మాతలు అందుకే హీరోయిన్ లతో పెద్ద పెద్ద సినిమాలు వద్దని చేయించినా సరే తక్కువ రేటు కి పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట. ఎక్కువగా డిమాండ్ చేసే హీరోయిన్ లు అయితే అవసరం లేదు అనే భావన లో స్టార్ హీరోలు కూడా ఉన్నారని కొందరు హీరోయిన్ లు అవకాశాలు  వచ్చినా  ఇప్పుడు భారీగా డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. 

 

దీనిపై ఇప్పుడు నిర్మాతలు కూడా అసహనంగా ఉన్నారని సమాచారం. పూజ హెగ్డే రష్మిక మంధన వంటి వారిని పక్కన పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నట్టు టాలీవుడ్ వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ జనాలు అందరూ కూడా ఇప్పుడు హీరోయిన్ ల కోసం అంత ఖర్చు వద్దని చెప్తున్నారు. అందుకే కొత్త హీరోయిన్ ల చుట్టూ టాలీవుడ్ తిరుగుతుంది. ఇతర భాషల్లో ఉన్న వాళ్ళు తెలుగులో సినిమాలను చేయడానికి ప్రయత్నాలను గట్టిగా చేస్తున్నారు. మరి ఇంకా ఏ హీరోయిన్ లను తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. 

 

హీరో సినిమా అయినా సరే ఇప్పుడు ఒకటికి పది సార్లు హీరోయిన్ ఖర్చు ని ఆలోచన చేసి ఓకే చెయ్యాలి అని భావిస్తున్నట్టు సమాచారం. పుష్ప సినిమాలో రష్మిక ఎక్కువగా డిమాండ్ చేస్తే మాత్రం ఆమెను అవసరం లేదని చెప్పే అవకాశాలు ఉన్నాయని మరో హీరోయిన్ ని తీసుకునే సూచనలు  ఉన్నాయని అంటున్నారు. మరి ఏ హీరోయిన్ ని ఆ సినిమా కోసం తీసుకుంటారు అనేది త్వరలోనే తెలుస్తుంది. అగ్ర హీరోలు అందరూ  కూడా హీరోయిన్ ల విషయంలో జాగ్రత్త పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: